ఆ దేశంలో సమస్యగా మారుతున్న ఎలుకలు

- June 19, 2021 , by Maagulf
ఆ దేశంలో సమస్యగా మారుతున్న ఎలుకలు

కువైట్: కువైట్ దేశంలో పలు ప్రాంతాల్లో ఎలుకల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎలుకలు పెద్దయెత్తున సంతతి పెంచుకుని, ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండడం పట్ల ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. సంబంధిత అథారిటీస్, ఎలుకలను నివారించడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. చెత్త డబ్బాలు, నిర్మాణ ప్రాంతాల్లోని చెత్త.. ఎలుకలకు ఆవాసాలుగా మారుతూ, వాటి సంతతి పెరగడానికి కేంద్రాలవుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com