కువైట్: జూన్ 23న భార‌త ఎంబ‌సీ 'ఓపెన్ హౌస్' కార్య‌క్ర‌మం

- June 20, 2021 , by Maagulf
కువైట్: జూన్ 23న భార‌త ఎంబ‌సీ \'ఓపెన్ హౌస్\' కార్య‌క్ర‌మం

కువైట్ సిటీ: కువైట్‌లోని భార‌త ఎంబ‌సీ ఈ నెల 23న‌(బుధ‌వారం) మధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు వ‌ర్చువ‌ల్ విధానంలో భార‌త‌ రాయ‌బారి సిబీ జార్జీతో ఓపెన్ హౌస్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో ఇటీవ‌ల కువైట్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ ప‌ర్య‌ట‌న‌, క‌మ్యూనిటీ సంక్షేమం పై రాయ‌బారి మాట్లాడానున్నారు. జూన్ 9-11 తేదీల మ‌ధ్య జైశంక‌ర్ కువైట్‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా భార‌త స‌మాజానికి క‌లిగిన ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించ‌నున్నారు.కువైట్‌లోని భార‌త ప్ర‌వాసులంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌వచ్చు. ఇక ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేసేందుకు ప్ర‌వాసులు త‌మ పాస్‌పోర్టులో ఉన్న విధంగా పూర్తి పేరు, పాస్‌పోర్ట్ నెంబ‌ర్, సివిల్ ఐడీ నెంబ‌ర్‌, కాంటాక్ట్ నెంబ‌ర్‌, కువైట్‌లో నివాసం ఉంటున్న అడ్ర‌స్ వివ‌రాల‌తో రాయ‌బార కార్యాల‌యం ఈ-మెయిల్ ఐడీ [email protected]కు మెయిల్ చేయాలి. ఈ వ‌ర్చువ‌ల్ ఓపెన్ హౌస్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు లింక్: https://zoom.us/j/92084791973?pwd=RlBjc0tIa1I3OEg1bHRIakZrOEF2dz09

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com