కువైట్: జూన్ 23న భారత ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- June 20, 2021
కువైట్ సిటీ: కువైట్లోని భారత ఎంబసీ ఈ నెల 23న(బుధవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు వర్చువల్ విధానంలో భారత రాయబారి సిబీ జార్జీతో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఇటీవల కువైట్లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పర్యటన, కమ్యూనిటీ సంక్షేమం పై రాయబారి మాట్లాడానున్నారు. జూన్ 9-11 తేదీల మధ్య జైశంకర్ కువైట్లో పర్యటించిన సందర్భంగా భారత సమాజానికి కలిగిన ప్రయోజనాలను వివరించనున్నారు.కువైట్లోని భారత ప్రవాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇక ఈ కార్యక్రమం సందర్భంగా తమ సమస్యలను తెలియజేసేందుకు ప్రవాసులు తమ పాస్పోర్టులో ఉన్న విధంగా పూర్తి పేరు, పాస్పోర్ట్ నెంబర్, సివిల్ ఐడీ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, కువైట్లో నివాసం ఉంటున్న అడ్రస్ వివరాలతో రాయబార కార్యాలయం ఈ-మెయిల్ ఐడీ [email protected]కు మెయిల్ చేయాలి. ఈ వర్చువల్ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు లింక్: https://zoom.us/j/92084791973?pwd=RlBjc0tIa1I3OEg1bHRIakZrOEF2dz09
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







