దైనందిన జీవితంలో భాగంగా యోగా: ఏపీ గవర్నర్
- June 21, 2021అమరావతి: అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం రాష్ట్ర ప్రజలకు యోగా దినోత్సవ సందేశాన్ని అందించిన గవర్నర్, కరోనా నేపథ్యంలో భారతీయ సంప్రదాయ జీవన విధానమైన యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరముందని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు కోవిడ్ -19 కష్టకాలంలో యోగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వైరస్ నుండి రక్షణ కవచాన్ని అందిస్తుందన్నారు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు యోగాభ్యాసం ఉత్తమమైన మార్గంమని గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ వివరించారు.ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు