వారికైనా ప్రయాణించాలంటే వ్యాక్సిన్లు తప్పనిసరి

- June 21, 2021 , by Maagulf
వారికైనా ప్రయాణించాలంటే  వ్యాక్సిన్లు తప్పనిసరి

కువైట్: వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులను మాత్రమే ఆగస్టు 1 నుండి కువైట్ కు అనుమతిస్తూ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆగష్టు 1 కల్లా వ్యాక్సిన్ల డోసులు ముగిసి ఉండాలి. ఈ షరతు ప్రతిఒక్కరికి అనగా ఇంట్లో పనిచేసే కార్మికులకు కూడా వర్తిస్తుంది.

ఇంట్లో పనిచేసే పనివారు కువైట్ కు రావాలన్నా, కువైట్ నుండి బయటకు వెళ్లాలన్నా తప్పనిసరిగా వ్యాక్సిన్ల రెండు డోసులు తీసుకొని ఉండాలి. లేనియెడల ప్రయాణానికి అర్హులు కారు. మొదటి డోసులో వ్యాక్సిన్ అందుకున్న తదుపరి కోవిడ్ బారిన పడిన గృహ కార్మికులు కువైట్ నుండి బయటికి వెళ్లాలంటే, రెండవ డోసు వ్యాక్సిన్ పూర్తి చేయాలి అని ప్రకటన పేర్కొంది.

కోవిడ్ వ్యాక్సిన్లు ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా యొక్క రెండు డోసులు లేదా జాన్సన్ & జాన్సన్ వారి సింగల్ డోసు వ్యాక్సిన్ పొందిన వారు అర్హులు..అయితే, ఆగష్టు 1 కల్లా వ్యాక్సిన్ల డోసులు ముగిసి ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com