‘కిరాతక’గా ఆది సాయికుమార్!
- June 22, 2021
హైదరాబాద్: లవ్లీ రాక్స్టార్ ఆది సాయికుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కిరాతక అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్గా పాయల్ రాజ్పూత్ నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎం. వీరభద్రం మాట్లాడుతూ ఆది కుమార్ హీరోగా నా దర్శకత్వం వచ్చిన 'చుట్టాలబ్బాయి' చక్కని విజయాన్ని అందుకుంది. మరోసారి మా ఇద్దరి కాంబినేషన్లో అద్భుతమైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఆది సరసన పాయల్ రాజ్పూత్ హీరోయిన్గా నటిస్తుంది.విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం, అలాగే రామ్రెడ్డి విజువల్స్ తప్పకుండా సినిమాకి ప్లస్ అవుతాయి అన్నారు. చిత్ర నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ”డిఫరెంట్ కాన్సెప్ట్తో డైరెక్టర్ వీరభద్రం చెప్పిన కథ బాగా నచ్చింది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నాం“ అన్నారు.
తాజా వార్తలు
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!