హజ్ 2021: కొనసాగుతున్న చివరి దశ రిజిస్ట్రేషన్
- June 26, 2021
సౌదీ: రెండవ మరియు చివరి దశ రిజిస్ట్రేషన్ హజ్ కోసం కొనసాగుతోంది. సౌదీ గెజిట్ వెల్లడించిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, జులై 9 రాత్రి 10 గంటల వరకు చివరి ఫేజ్ రిజిస్ట్రేషన్ యాత్రీకుల కోసం కొనసాగనుంది. అందుబాటులో వున్న స్లాట్స్ మీద ఆధారపడి దరఖాస్తుల స్వీకరణ ఆధారపడి వుంటుందని మినిస్ట్రీ పేర్కొంది. హజ్ కోసం అర్హత సాధించినవారికి ఎస్.ఎం.ఎస్. ద్వారా సమాచారం పంపిస్తున్నట్లు మినిస్ట్రీ వివరించింది. ఎవరైతే అర్హత సాధించారో వారు మాత్రమే పోర్టల్ ద్వారా సమాచారం పొందగలుగుతారు. అర్హత సాధించినవారు తమతోపాటు మరొకర్ని (గతంలో ఖచ్చితంగా హజ్ కోసం దరఖాస్తు చేసుకుని వుండాలి) సహచరుడిగా నమోదు చేయవచ్చు. సనాద్ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానం ద్వారా చెల్లింపులు చేయాల్సి వుంటుంది. చివరి దశలో హజ్ అనుమతులు జారీ అవుతాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







