కోవిడ్ రూల్స్ బ్రేకర్స్ పై కఠిన చర్యలు
- June 27, 2021
బహ్రెయిన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి నుంచి బహ్రెయిన్ ప్రజలను రక్షించుకోవటం ప్రభుత్వ విభాగాలు, ప్రజల ఉమ్మడి బాధ్యతని బహ్రెయిన్ పోలీస్ డైరెక్టరేట్లు అభిప్రాయపడ్డాయి. ప్రజల్లో అవగాహన కల్పించటం, అదేవిధంగా ప్రజలు కూడా సమాజ భద్రతకు తమ వంతు బాధ్యతగా కోవిడ్ నిబంధనలు పాటించటం అత్యవసరం అనే విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అంతర్గత మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పలు గవర్నరేట్లలో పోలీస్ డైరెక్టరేట్ల వారీగా పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వాహించినట్లు అధికారులు వెల్లడించారు. అవగాహన కార్యక్రమాలతో పాటు కోవిడ్ రూల్స్ అమలుపై కూడా అదే స్థాయిలో ఫోకస్ చేశామన్నారు. జూన్ 23 నాటికి బహ్రెయిన్ లోని పలు పోలీస్ డైరెక్టరేట్ల పరిధిలో వేల సంఖ్యలో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. సమాజిక దూరాన్ని పాటించనందుకు 10,860 మందిపై కేసు నమోదు చేశామని, మాస్క్ ధరించని 91043 మందిపై కేసులు బుక్ చేశామన్నారు. ఇదిలాఉంటే...ఇప్పటివరకు కోవిడ్ నిబంధనలు, పాటించాల్సిన జాగ్రత్తలపై 12,426 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









