నాన్ వ్యాక్సినేటెడ్ వారిని అనుమతిస్తే KD5000 ఫైన్
- June 28, 2021
కువైట్: వ్యాక్సిన్ తీసుకోని వారిని అనుమతిస్తే మాల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే అనుమతించాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని మాల్స్, క్లబ్స్, రెస్టారెంట్లు, కేఫ్ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని మరోసారి గుర్తు చేశారు. ఎవరైనా మంత్రివర్గ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే KD 5000 వరకు ఫైన్ విధిస్తామన్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా 6000 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న మాల్స్ తో పాటు రెస్టారెంట్లు, కేఫ్ లలోకి వ్యాక్సిన్ తీసుకున్న వారికే అనుమతించాలన్న నిబంధన ఆదివారం నుంచే అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. మై కువైట్ ఐడీ, ఇమ్యూన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికెట్లను చెక్ చేసిన తర్వాతే కస్టమర్లను లోనికి అనుమతించాలని అధికారులు సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు మాల్స్ లోకి ఎంటరైతే సదరు వినియోగదారుడు మోసపూరితంగా లోనికి ప్రవేశించినట్లు మేనేజ్మెంట్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే..ఈ నిబంధన పండ్లు, కూరగాయల వంటి నిత్యావసరాల షాపులకు వర్తించదు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







