నాన్ వ్యాక్సినేటెడ్ వారిని అనుమతిస్తే KD5000 ఫైన్
- June 28, 2021
కువైట్: వ్యాక్సిన్ తీసుకోని వారిని అనుమతిస్తే మాల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే అనుమతించాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని మాల్స్, క్లబ్స్, రెస్టారెంట్లు, కేఫ్ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని మరోసారి గుర్తు చేశారు. ఎవరైనా మంత్రివర్గ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే KD 5000 వరకు ఫైన్ విధిస్తామన్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా 6000 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న మాల్స్ తో పాటు రెస్టారెంట్లు, కేఫ్ లలోకి వ్యాక్సిన్ తీసుకున్న వారికే అనుమతించాలన్న నిబంధన ఆదివారం నుంచే అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. మై కువైట్ ఐడీ, ఇమ్యూన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికెట్లను చెక్ చేసిన తర్వాతే కస్టమర్లను లోనికి అనుమతించాలని అధికారులు సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు మాల్స్ లోకి ఎంటరైతే సదరు వినియోగదారుడు మోసపూరితంగా లోనికి ప్రవేశించినట్లు మేనేజ్మెంట్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే..ఈ నిబంధన పండ్లు, కూరగాయల వంటి నిత్యావసరాల షాపులకు వర్తించదు.
తాజా వార్తలు
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!









