నాన్ వ్యాక్సినేటెడ్ వారిని అనుమతిస్తే KD5000 ఫైన్

- June 28, 2021 , by Maagulf
నాన్ వ్యాక్సినేటెడ్ వారిని అనుమతిస్తే KD5000 ఫైన్

కువైట్: వ్యాక్సిన్ తీసుకోని వారిని అనుమతిస్తే మాల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే అనుమతించాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని మాల్స్, క్లబ్స్, రెస్టారెంట్లు, కేఫ్ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని మరోసారి గుర్తు చేశారు. ఎవరైనా మంత్రివర్గ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే KD 5000 వరకు ఫైన్ విధిస్తామన్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా 6000 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న మాల్స్ తో పాటు రెస్టారెంట్లు, కేఫ్ లలోకి వ్యాక్సిన్ తీసుకున్న వారికే అనుమతించాలన్న నిబంధన ఆదివారం నుంచే అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. మై కువైట్ ఐడీ, ఇమ్యూన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికెట్లను చెక్ చేసిన తర్వాతే కస్టమర్లను లోనికి అనుమతించాలని అధికారులు సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు మాల్స్ లోకి ఎంటరైతే సదరు వినియోగదారుడు మోసపూరితంగా లోనికి ప్రవేశించినట్లు మేనేజ్మెంట్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే..ఈ నిబంధన పండ్లు, కూరగాయల వంటి నిత్యావసరాల షాపులకు వర్తించదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com