200 కేంద్రాల ద్వారా మెగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ను చేపట్టిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్
- June 29, 2021
హైదరాబాద్: జాతీయ వ్యాక్సిన్ డ్రైవ్ను వేగవంతం చేయడానికి అపోలో హాస్పిటల్స్ 2021, జూన్ 30వ తేది బుధవారం నాడు దేశవ్యాప్తంగా మెగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ను నిర్వహించనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఈరోజున ప్రకటించింది. దేశంలోని 50 నగరాల్లో విస్తరించి ఉన్న 200 అపోలో వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ భారీ ఎత్తున నిర్వహించబడుతుంది.
కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ సులభంగా మరియు వేగంగా అందుబాటులో ఉంచడానికి అపోలో యొక్క అత్యాధునిక సాంకేతిక వేదిక అయినటువంటి అపోలో 24/7 యాప్ను ఉపయోగించి స్లాట్ను బుక్ చేసుకోవచ్చు మరియు తమకు సమీపంలోని అపోలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. వేచి వుండే సమయాన్ని మరియు లైన్లను తగ్గించి తమకు ఇష్టమైన స్లాట్ను ఎంపిక చేసుకోవడంలో యాప్ వినియోగదారుడికి రియల్ - టైమ్ సమాచారాన్ని అందిస్తుంది.
గరిష్ట సంఖ్యలో వ్యక్తులకు వ్యాక్సిన్లు అందించడం కోసం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ అపోలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ను నిర్వహించడం జరుగుతుంది, తద్వారా ప్రతి ఒక్కరు వారి యొక్క సౌలభ్యం ప్రకారం స్లాట్ను ఎంపిక చేసుకోవచ్చు.
అన్ని వ్యాక్సిన్ కేంద్రాలలో ఎటువంటి అంతరాయం అనేది లేకుండా సురక్షిత వ్యాక్సిన్ ప్రోటోకాల్స్పై అపోలో 10,000 మంది సిబ్బందికి శిక్షణను అందించింది.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్, ఎగ్జిక్యూటివ్ వైస్ - చైర్పర్సన్, శోభన కామినేని మాట్లాడుతూ, ‘‘ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ను అందుకునే వరకు ఏ ఒక్కరూ కూడా సురక్షితం కాదని మేము నమ్ముతున్నాము. గరిష్ట సంఖ్యలో వ్యక్తులు వ్యాక్సిన్ను అందుకోవడానికి ఈ డ్రైవ్ వీలు కల్పిస్తుంది. కోవిడ్ 3వ వేవ్ను తగ్గించడంలోనూ మరియు మనం తిరిగి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టడంలోనూ వ్యాక్సినేషన్ అనేది అత్యుత్తమమైన రక్షణ అని చెప్పవచ్చు. అపోలో దీనిపై దృఢ నిశ్చయంతో దృష్టి పెట్టింది” అని ఆమె అన్నారు.
2021 జూలై నాటికి 500 మిలియన్ల వ్యాక్సిన్లను అందించాలనే లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలవడంలో అపోలో యొక్క నిబద్దతకు ఈ డ్రైవ్ ఒక భాగం.
అపోలో ఈరోజు వరకు దేశంలో 2.1 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోస్లను ఇచ్చి అతిపెద్ద ప్రయివేటు వ్యాక్సినేటర్గా నిలిచింది. ఈ మెగా క్యాంప్కు వచ్చే స్పందన ఆధారంగా అపోలో కేంద్రాలు వ్యాక్సినేషన్ శిబిరాలను కొనసాగిస్తాయి. సంకోచించకండి,వ్యాక్సిన్ తీసుకోండి!
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









