దుబాయ్: 24/7 రెసిడెన్సీ వీసా సర్వీస్ ప్రారంభం
- June 30, 2021
దుబాయ్: రెసిడెన్సీ వీసా, ఎంక్వైరీ, ఇతర సేవలను మరింత సరళతరం చేస్తూ యూఏఈ కొత్త సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించింది. 'యూ ఆర్ స్పెషల్'(మీరు మాకు ప్రత్యేకం) పేరుతో ప్రతి రోజూ 24 గంటల పాటు ఈ సేవా కేంద్రంలోని సర్వీస్ టీం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. జులై 7 నుంచి యూ ఆర్ స్పెషల్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నివాస, విదేశీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ కార్యాలయం వెల్లడించింది. వారంలో ఏ రోజైనా ఏ సమయంలోనైనా కంపెనీలు, పౌరులు, ప్రవాసీయులు వ్యక్తిగతంగా రెసిడెన్సీ సర్వీస్, ఇతర ఎంక్వైరీలకు సంబంధించిన దరఖాస్తులను యూ ఆర్ స్పెషల్ టీం స్వీకరిస్తుంది. అలాగే దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంటుంది. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించేందుకు ఏకీకృత సేవా కేంద్రం ఏర్పాటుకు పురికొల్పిందని, దీంతో యూఏఈ, ముఖ్యంగా దుబాయ్ ని డిజిటల్ సేవా రంగంలో మరింత ప్రత్యేకతను చాటుకునేలా చేస్తుందని GDRFA డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మరి అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







