దుబాయ్: 24/7 రెసిడెన్సీ వీసా సర్వీస్ ప్రారంభం
- June 30, 2021
దుబాయ్: రెసిడెన్సీ వీసా, ఎంక్వైరీ, ఇతర సేవలను మరింత సరళతరం చేస్తూ యూఏఈ కొత్త సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించింది. 'యూ ఆర్ స్పెషల్'(మీరు మాకు ప్రత్యేకం) పేరుతో ప్రతి రోజూ 24 గంటల పాటు ఈ సేవా కేంద్రంలోని సర్వీస్ టీం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. జులై 7 నుంచి యూ ఆర్ స్పెషల్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నివాస, విదేశీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ కార్యాలయం వెల్లడించింది. వారంలో ఏ రోజైనా ఏ సమయంలోనైనా కంపెనీలు, పౌరులు, ప్రవాసీయులు వ్యక్తిగతంగా రెసిడెన్సీ సర్వీస్, ఇతర ఎంక్వైరీలకు సంబంధించిన దరఖాస్తులను యూ ఆర్ స్పెషల్ టీం స్వీకరిస్తుంది. అలాగే దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంటుంది. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించేందుకు ఏకీకృత సేవా కేంద్రం ఏర్పాటుకు పురికొల్పిందని, దీంతో యూఏఈ, ముఖ్యంగా దుబాయ్ ని డిజిటల్ సేవా రంగంలో మరింత ప్రత్యేకతను చాటుకునేలా చేస్తుందని GDRFA డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మరి అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









