విదేశీ వ్యవసాయ కార్మికుల భర్తీకి కోవిడ్ కమిటీ గ్రీన్ సిగ్నల్
- July 01, 2021
కువైట్: విదేశీ వ్యవసాయ కార్మికులను భర్తీకి కోవిడ్ ఎమర్జెన్సీ మినిస్ట్రియల్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విదేశాల నుంచి వ్యవసాయ కార్మికులు కువైట్ చేరుకునేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కోవిడ్ కారణంగా విదేశీయుల రాకపై పలు ఆంక్షలు ఉండటంతో వ్యవసాయ రంగంలో కార్మికుల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో కువైట్ రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. కార్మికుల కొరతతో వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని, విదేశీ కార్మికులను అనుమతించాలని కోరాయి. దీనికి స్పందించిన ప్రభుత్వం..కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూనే తగిన జాగ్రత్తలతో 'అల్ సలమా' యాప్ ద్వారా విదేశాల నుంచి వ్యవసాయ కార్మికుల భర్తీకి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన రైతు సంఘాలు..రైతుల భర్తీకి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపాయి.
తాజా వార్తలు
- అమెరికా పర్యటనకు కేటీఆర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ సీజ్
- పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో యూనిలివర్ లో నియామకాల పై బ్రేక్
- అలర్ట్..పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు!
- రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం చంద్రబాబు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!









