విదేశీ వ్యవసాయ కార్మికుల భర్తీకి కోవిడ్ కమిటీ గ్రీన్ సిగ్నల్
- July 01, 2021కువైట్: విదేశీ వ్యవసాయ కార్మికులను భర్తీకి కోవిడ్ ఎమర్జెన్సీ మినిస్ట్రియల్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విదేశాల నుంచి వ్యవసాయ కార్మికులు కువైట్ చేరుకునేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కోవిడ్ కారణంగా విదేశీయుల రాకపై పలు ఆంక్షలు ఉండటంతో వ్యవసాయ రంగంలో కార్మికుల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో కువైట్ రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. కార్మికుల కొరతతో వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని, విదేశీ కార్మికులను అనుమతించాలని కోరాయి. దీనికి స్పందించిన ప్రభుత్వం..కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూనే తగిన జాగ్రత్తలతో 'అల్ సలమా' యాప్ ద్వారా విదేశాల నుంచి వ్యవసాయ కార్మికుల భర్తీకి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన రైతు సంఘాలు..రైతుల భర్తీకి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..