కరోనా కట్టడిలో స్వచ్ఛంద సేవలు అభినందనీయం
- July 01, 2021
విజయవాడ: కరోనా కట్టడిలో స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వానికి అందిస్తున్న సహకారం అభినందనీయమని ఉపముఖ్యమంత్రి, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. బుధవారం విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న గురుద్వారా శ్రీ గురుసింగ్ సభకు చెందిన సిక్కు ప్రతినిధులు కోవిడ్ బాధితులకోసం ఆక్సీజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందచేసిన కార్యక్రమంలో మంత్రి ఆళ్ల నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ ఆధ్వర్యంలో సిక్కు ప్రతినిధులు కోవిడ్ బాధితులను ఆదుకోవటంతో పాటు సమాజానికి అనేక రూపాలలో సేవలందిస్తున్నారని ప్రశంసించారు. సామాజిక బాధ్యత గా ప్రతి ఒక్కరూ కోవిడ్ బాధితుల్ని ఆదుకోవాలని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. సిక్కు ప్రతినిధుల సేవానిరతిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి అందచేసిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లను అవసరమైన వారికి అందిస్తామన్నారు. దుబాయ్ కి చెందిన గురుద్వారా గురునానక్ దర్బార్, ఎస్ సురిందర్సింగ్ ఖందారీ 10 లీటర్ల సామర్థ్యం గల 12 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందచేశారని గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ అధ్యక్షుడు ఎస్ కన్వర్జిత్సింగ్ చెప్పారు. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని చేతులమీదుగా ప్రభుత్వానికి అందజేశామన్నారు.ఈ కార్యక్రమంలో గురుసింగ్ సభ కార్యరద్శి ఎస్.హర్ మొహిందర్ సింగ్, కమిటీ సభ్యులు హర్మీత్ సింగ్, జెజె సింగ్, గుర్జిత్ సింగ్, కన్వర్జోత్ సింగ్, గునీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







