బోసిపోయిన సోహర్ రహదారులు..రాత్రి వేళల్లో కనిపించని జనం

- July 01, 2021 , by Maagulf
బోసిపోయిన సోహర్ రహదారులు..రాత్రి వేళల్లో కనిపించని జనం

ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ పాక్షిక ఆంక్షలు విధించటంతో సోహర్ రహదారులు బోసిపోయాయి. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అత్యవసర వాహనాలకు మినహా ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని సుప్రీం కమిటీ ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీం కమిటీ సూచనలకు అనుగుణంగా జనం కూడా ఆంక్షల సమయంలో బయటకు రావటం లేదు. దీంతో సోహర్ విలయత్ లోని రోడ్లన్ని ఖాళీగా కనిపించాయి. ఇదిలా ఉంటే..కొద్ది రోజులుగా సోహర్ విలయత్ లో కోవిడ్ తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం కూడా 179 కొత్త కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. దీంతో విలయత్ పరిధిలో ఇప్పటి వరకు కోవిడ్ కేసుల సంఖ్య 20,031కి పెరిగింది. మృతుల సంఖ్య 215కి పెరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com