బోసిపోయిన సోహర్ రహదారులు..రాత్రి వేళల్లో కనిపించని జనం
- July 01, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ పాక్షిక ఆంక్షలు విధించటంతో సోహర్ రహదారులు బోసిపోయాయి. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అత్యవసర వాహనాలకు మినహా ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని సుప్రీం కమిటీ ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీం కమిటీ సూచనలకు అనుగుణంగా జనం కూడా ఆంక్షల సమయంలో బయటకు రావటం లేదు. దీంతో సోహర్ విలయత్ లోని రోడ్లన్ని ఖాళీగా కనిపించాయి. ఇదిలా ఉంటే..కొద్ది రోజులుగా సోహర్ విలయత్ లో కోవిడ్ తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం కూడా 179 కొత్త కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. దీంతో విలయత్ పరిధిలో ఇప్పటి వరకు కోవిడ్ కేసుల సంఖ్య 20,031కి పెరిగింది. మృతుల సంఖ్య 215కి పెరిగింది.
తాజా వార్తలు
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- రీఫండ్, తేదీ మార్పులకు ఖతార్ ఎయిర్వేస్ అవకాశం..!!
- VerSe Innovation లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్.రమేష్ నియామకం
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 90వ సమావేశం ఘన విజయం
- అమెరికా పర్యటనకు కేటీఆర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ సీజ్









