బోసిపోయిన సోహర్ రహదారులు..రాత్రి వేళల్లో కనిపించని జనం
- July 01, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ పాక్షిక ఆంక్షలు విధించటంతో సోహర్ రహదారులు బోసిపోయాయి. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అత్యవసర వాహనాలకు మినహా ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని సుప్రీం కమిటీ ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీం కమిటీ సూచనలకు అనుగుణంగా జనం కూడా ఆంక్షల సమయంలో బయటకు రావటం లేదు. దీంతో సోహర్ విలయత్ లోని రోడ్లన్ని ఖాళీగా కనిపించాయి. ఇదిలా ఉంటే..కొద్ది రోజులుగా సోహర్ విలయత్ లో కోవిడ్ తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం కూడా 179 కొత్త కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. దీంతో విలయత్ పరిధిలో ఇప్పటి వరకు కోవిడ్ కేసుల సంఖ్య 20,031కి పెరిగింది. మృతుల సంఖ్య 215కి పెరిగింది.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







