వైద్యరంగానికి రూ.2 లక్షల కోట్ల నిధులు...
- July 01, 2021
న్యూ ఢిల్లీ: డాక్టర్స్ డే సందర్బంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరనా సమయంలో వైద్యులు చేసిన సేవలను కొనియాడారు. వైద్యసదుపాయాలను మెరుగుపరిచామని ప్రధాని మోడి పేర్కొన్నారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ అనేక మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో వైద్యులు ముందు వరసలో ఉన్నారి, వారి ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాదిమంది ప్రజల ప్రాణాలు కాపాడారని ప్రధాని పేర్కొన్నారు. వైద్యరంగం కోసం రూ.2 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రధాని తెలిపారు.
ఈ ఏడాది మార్చి నుంచి దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. ఫిబ్రవరి వరకు కరోనా కేసులు పెద్దగా లేకున్నా, మార్చినుంచి ఒక్కసారిగా పెరిగాయి. అసుపత్రుల కొరత, అత్యవసర విభాగాల కొరత తీవ్రంగా కనిపించింది. అంతేకాదు, దేశంలో ఏప్రిల్, మే నెలలో ఆక్సీజన్ కొరత కారణంగా అనేక మంది కరోనా రోగులు మృతిచెందారు. దీంతో దేశంలో ఆక్సీజన్, ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాలను ప్రభుత్వాలు వేగంగా ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు. వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







