దేశంలోకి తిరిగొచ్చే వలసదారులకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో
- July 07, 2021
కువైట్: దేశంలోకి తిరిగొచ్చే వలసదారులకు (నివాసితులకు) సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారికి ఆగస్ట్ 1 నుంచి దేశంలోకి వలసదారుల్ని అనుమతించనున్న నేపథ్యంలో సంబంధిత మార్గదర్శకాల విషయమై కసరత్తు జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికారులతో సమావేశం కోసం ఎయిర్పోర్టు అథారిటీస్ ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం వున్న ఆపరేషనల్ కెపాసిటీ 3,500 నుంచి 5,000కి పెంపు విషయమై పలు అనుమానాలకు ఈ సమావేశంలో నివృత్తి కలగనుంది. జూన్ 17న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, విదేశాల నుంచి వచ్చే వలసదారులు (రెసిడెంట్స్) విషయమై రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతిచ్చేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్ట్ 1 నుంచి వారి రాకకు అనుమతిస్తారు. అయితే, 72 గంటల ముందుగా వారంతా పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకురావాల్సి వుంటుంది. ఏడు రోజుల హోం క్వారంటైన్ కూడా తప్పనిసరి.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









