దేశంలోకి తిరిగొచ్చే వలసదారులకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో
- July 07, 2021
కువైట్: దేశంలోకి తిరిగొచ్చే వలసదారులకు (నివాసితులకు) సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారికి ఆగస్ట్ 1 నుంచి దేశంలోకి వలసదారుల్ని అనుమతించనున్న నేపథ్యంలో సంబంధిత మార్గదర్శకాల విషయమై కసరత్తు జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికారులతో సమావేశం కోసం ఎయిర్పోర్టు అథారిటీస్ ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం వున్న ఆపరేషనల్ కెపాసిటీ 3,500 నుంచి 5,000కి పెంపు విషయమై పలు అనుమానాలకు ఈ సమావేశంలో నివృత్తి కలగనుంది. జూన్ 17న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, విదేశాల నుంచి వచ్చే వలసదారులు (రెసిడెంట్స్) విషయమై రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతిచ్చేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్ట్ 1 నుంచి వారి రాకకు అనుమతిస్తారు. అయితే, 72 గంటల ముందుగా వారంతా పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకురావాల్సి వుంటుంది. ఏడు రోజుల హోం క్వారంటైన్ కూడా తప్పనిసరి.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







