దేశంలోకి తిరిగొచ్చే వలసదారులకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో
- July 07, 2021
కువైట్: దేశంలోకి తిరిగొచ్చే వలసదారులకు (నివాసితులకు) సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారికి ఆగస్ట్ 1 నుంచి దేశంలోకి వలసదారుల్ని అనుమతించనున్న నేపథ్యంలో సంబంధిత మార్గదర్శకాల విషయమై కసరత్తు జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికారులతో సమావేశం కోసం ఎయిర్పోర్టు అథారిటీస్ ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం వున్న ఆపరేషనల్ కెపాసిటీ 3,500 నుంచి 5,000కి పెంపు విషయమై పలు అనుమానాలకు ఈ సమావేశంలో నివృత్తి కలగనుంది. జూన్ 17న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, విదేశాల నుంచి వచ్చే వలసదారులు (రెసిడెంట్స్) విషయమై రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతిచ్చేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్ట్ 1 నుంచి వారి రాకకు అనుమతిస్తారు. అయితే, 72 గంటల ముందుగా వారంతా పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకురావాల్సి వుంటుంది. ఏడు రోజుల హోం క్వారంటైన్ కూడా తప్పనిసరి.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







