దుబాయ్ లో భారీ పేలుడు..హడలిపోయిన ప్రజలు

- July 08, 2021 , by Maagulf
దుబాయ్ లో భారీ పేలుడు..హడలిపోయిన ప్రజలు

దుబాయ్: దుబాయ్ జెబెల్ అలీ పోర్ట్ లో భారీ పేలుడు సంభవించింది. పోర్ట్ లో కంటైనర్ షిప్ కు మాటలు అంటుకొని భారీగా పేలుడు సంభవించింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.


 
"అది షుమారు రాత్రి 12 గంటల సమయం..ఒక్కసారిగా భారీ పేలుడు వినిపించింది... బిల్డింగులు కదిలినట్టు అనిపించేసిరికి భూకంపమేమో అని అనుకున్నాం.. బాల్కనీలోకి వచ్చి చూసేసరికి ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది..మాకు చాలా భయం వేసింది." అంటూ పోర్ట్ కు దగ్గర్లో ఉన్న 'డిస్కవరీ గార్డెన్స్' కమ్యూనిటీ లో నివసిస్తున్న వారు 'మాగల్ఫ్' కు తమ అనుభవాన్ని తెలియజేసారు.

ఈ శబ్దానికి ఉలిక్కిపడ్డ జనం తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com