సురభి కళాకారులకు గల్ఫ్ తెలుగు సంఘాల చేయూత
- July 08, 2021
కరోనా మహమ్మారి ఎన్నో జీవితాల్ని చిదిమేసింది.మరెన్నో జీవితాలను,వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది.ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక కళాకారులు ఈ కరోనా సమయంలో ఆదరించే దిక్కులేక జీవనోపాధి కోల్పోయారు.తినడానికి తిండి కూడా లేని దైన్యస్థితి లో ఉన్నారు నాటక రంగాన్నే నమ్ముకున్న ఎంతోమంది కళాకారులు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కళాకారులకు,వారి కుటుంబాలకు అండగా నిలుస్తోంది గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య.గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలన్నీ ఒక త్రాటిపై నిలచి సురభి కళాకారులచే జూమ్ లింక్ ద్వారా నాటక ప్రదర్శనలు చేయిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించారు.దీనిలో భాగంగా తెలుగు కళా సమితి బహ్రెయిన్ ఆధ్వర్యంలో జులై 9వ తేదీన మాయా బజార్ మొదటి నాటకంగా ప్రదర్శించబడుతుంది.అంతర్జాల మాధ్యమంగా ఈ నాటకాన్ని బహ్రెయిన్ దేశంలోని తెలుగు వారితో పాటు దుబాయ్,కువైట్,ఖతార్, ఒమన్ మరియు సౌదీ అరేబియా దేశాల్లోని తెలుగు వారు ఒకే సారి చూడవచ్చు.జులై నెల ప్రదర్శన తరువాత వరుసగా తెలుగు కళా సమితి ఒమన్ (ఆగస్టు),తెలుగు కళా సమితి కువైట్ (సెప్టెంబర్),ఆంధ్ర కళా వేదిక ఖతార్ (అక్టోబర్),తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్ (నవంబర్) ఆధ్వర్యంలో సురభి కళాకారులతో వివిధ నాటకాలు ప్రదర్శించబడతాయి.తద్వారా నాటక రంగ సేవతో పాటు కష్టాలలో ఉన్న కళాకారులను ఆదుకోవడం జరుగుతుంది.ఈ వర్చ్యువల్ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







