వైఎస్ఆర్‌కు నివాళులర్పించిన విజయమ్మ, షర్మిల

- July 08, 2021 , by Maagulf
వైఎస్ఆర్‌కు నివాళులర్పించిన విజయమ్మ, షర్మిల

కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేడు.ఈ సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళి అర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు తరలివస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల నివాళర్పించారు.వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

వైఎస్సార్ కుమార్తె అయిన షర్మిల ఈరోజు తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. తన తండ్రికి నివాళులర్పించిన అనంతరం షర్మిల నేరుగా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్‌ అభిమానుల సమక్షంలో వైఎస్‌ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు ఎజెండాను ప్రకటించనున్నారు.మరోవైపు వైఎస్ఆర్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మధ్యాహ్న సమయంలో ఇడుపులపాయకు చేరుకుని తండ్రికి నివాళులర్పించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com