కార్మికులకు గొడుగు టోపీలను పంపిణీ చేసిన సదరన్ ఏరియా మునిసిపాలిటీ

- July 09, 2021 , by Maagulf
కార్మికులకు గొడుగు టోపీలను పంపిణీ చేసిన సదరన్ ఏరియా మునిసిపాలిటీ

మనామా: సదరన్ ఏరియా మునిసిపాలిటీ, పని ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికులకు గొడుగు టోపీలను పంపిణీ చేసింది. స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తలకు తేలిగ్గా అమరిపోయేలా ఈ గొడుగు టోపీలను రూపొందించారు. ఎండ నుంచి కార్మికులకు ఈ గొడుగు టోపీలు రక్షణ ఇస్తాయి. వాటిని వారు పట్టుకోవాల్సిన పనిలేదు. ఎండ సమయాల్లో కార్మికులు ఎండ ప్రభావానికి గురి కాకుండా ఈ టోపీలు రక్షణ కల్పిస్తాయని అధికారులు తెలిపారు. స్వచ్ఛందంగా వీటిని అందించేందుకు ముందుకొచ్చిన ఆయా సంస్థల్ని మునిసిపాలిటీ అభినందించింది. జులై నుంచి ఆగస్ట్ చివరి వరకు మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేస్తూ సదరన్ మునిసిపాలిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ వేడిలో పని చేయడంపై బ్యాన్ కొనసాగుతోంది. ఈ నిబంధనను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com