ఇంధన ద్వైపాక్షిక భాగస్వామ్యాంపై సౌదీ, భారత్ మంత్రుల ఫోన్ కాల్
- July 17, 2021
సౌదీ: సౌదీ, భారత్ మధ్య ఇంధన ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలపడాలని తాము అభిలాషించినట్లు భారత కేంద్రమంత్రి హర్ధిక్ సింగ్ పూరీ వెల్లడించారు.
భారత పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న హర్దిక్ సింగ్ పూరీకి సౌదీ ఎనర్జీ మినిస్టర్, ప్రిన్స్ అబ్ధులాజీజ్ బిన్ సల్మాన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా చమురు ధరలు, అంతర్జాతీయంగా చమురు రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భారత చమురు అవససరాలపై సౌదీ మంత్రితో ప్రస్తావించినట్లు హర్ధిక సింగ్ పూరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాబోయే కాలంలో భారత చమురు అవసరాలను తీర్చటంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించాలని కోరినట్లు తెలిపారు. అదే సమయంలో అమ్మకందారు-కొనుగోలుదారు పరిధిలో ఇరు దేశాల మధ్య చమురు ద్వైపాక్షిక భాగస్వామ్యం పటిష్టం అవ్వాలని, రెండు వైపుల నుంచి పెట్టుబడి అవకాశాలను సరళమైన విధానాలను అవలంభించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కొద్దికాలంగా చమురు ధరల్లో చోటు చేసుకుంటున్న అసాధారణ పెరుగుదల నియంత్రణకు కృషి చేయాలని, అందుకు సౌదీ సహకరించాలని కోరారు. అలాగే చమురు ధరల తగ్గింపు కోసం అబుధాబి నేషనల్ ఆయిల్ కార్పోరేషన్ -ADNOC, యూఏఈ మద్దతు తీసుకోవాలని ADNOC చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కు పిలుపునిచ్చారు మంత్రి హర్ధిక్ సింగ్ పూరీ.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







