ఇంధన ద్వైపాక్షిక భాగస్వామ్యాంపై సౌదీ, భారత్ మంత్రుల ఫోన్ కాల్
- July 17, 2021
సౌదీ: సౌదీ, భారత్ మధ్య ఇంధన ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలపడాలని తాము అభిలాషించినట్లు భారత కేంద్రమంత్రి హర్ధిక్ సింగ్ పూరీ వెల్లడించారు.
భారత పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న హర్దిక్ సింగ్ పూరీకి సౌదీ ఎనర్జీ మినిస్టర్, ప్రిన్స్ అబ్ధులాజీజ్ బిన్ సల్మాన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా చమురు ధరలు, అంతర్జాతీయంగా చమురు రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భారత చమురు అవససరాలపై సౌదీ మంత్రితో ప్రస్తావించినట్లు హర్ధిక సింగ్ పూరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాబోయే కాలంలో భారత చమురు అవసరాలను తీర్చటంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించాలని కోరినట్లు తెలిపారు. అదే సమయంలో అమ్మకందారు-కొనుగోలుదారు పరిధిలో ఇరు దేశాల మధ్య చమురు ద్వైపాక్షిక భాగస్వామ్యం పటిష్టం అవ్వాలని, రెండు వైపుల నుంచి పెట్టుబడి అవకాశాలను సరళమైన విధానాలను అవలంభించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కొద్దికాలంగా చమురు ధరల్లో చోటు చేసుకుంటున్న అసాధారణ పెరుగుదల నియంత్రణకు కృషి చేయాలని, అందుకు సౌదీ సహకరించాలని కోరారు. అలాగే చమురు ధరల తగ్గింపు కోసం అబుధాబి నేషనల్ ఆయిల్ కార్పోరేషన్ -ADNOC, యూఏఈ మద్దతు తీసుకోవాలని ADNOC చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కు పిలుపునిచ్చారు మంత్రి హర్ధిక్ సింగ్ పూరీ.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







