NRI సర్టిఫికెట్ దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్ లేకుండానే ఇండియన్ ఎంబసీని సందర్శించవచ్చు

- July 17, 2021 , by Maagulf
NRI సర్టిఫికెట్ దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్ లేకుండానే ఇండియన్ ఎంబసీని సందర్శించవచ్చు

దోహా: మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంటల మధ్య, పని దినాల్లో దరఖాస్తు దారుల్ని అనుమతించాలని ఇండియన్ ఎంబసీ నిర్ణయం తీసుకుంది. ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేకుండానే తమ ఎన్నారై సర్టిఫికెట్ దరఖాస్తుని సమర్పించడానికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఎన్నారై విభాగంలో, ఇండియాలోని కళాశాలల్లో విద్యాభ్యాసం కోసం ఎన్నారై సర్టిఫికెట్ అవసరం కావడంతో, పెద్ద సంఖ్యలో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఈ అవకాశం ఎన్నారై సర్టిఫికెట్ దరఖాస్తులకు మాత్రమేననీ, కాన్సులర్ సర్వీసులుకు ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరమనీ ఎంబసీ పేర్కొంది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com