53% జనాభాకి వ్యాక్సినేషన్ అందించిన సౌదీ

- July 20, 2021 , by Maagulf
53% జనాభాకి వ్యాక్సినేషన్ అందించిన సౌదీ

సౌదీ అరేబియా: 53 శాతానికి పైగా జనాభాకు వ్యాక్సినేషన్ అందించినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. 2020 డిసెంబర్ 15 నుంచి 2021 జులై 18 నాటికి మైలు రాయిని అందుకోవడం జరిగింది. అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తోన్న సౌదీ అరేబియా కొద్ది నెలల్లోనే 70 శాతం వ్యాక్సినేషన్ అనే మైలురాయిని అందుకోనుంది.  కేవలం రెండున్నర నెలల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకునే అవకాశం వుంది. అనునిత్యం 369,000 డోసుల వ్యాక్సినేషన్ ప్రస్తుతం అందిస్తున్నారు. 587 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదట్లో కేవలం 40,000 వ్యాక్సిన్లతో మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com