ఏపీలో కరోనా కేసుల వివరాలు
- July 22, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1843 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,48,592కి చేరింది.ఇందులో 19,11,812 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 23,571 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 12 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,209 మంది మృతి చెందారు.రాష్ట్రంలో 24 గంటల్లో 70,727 శాంపిల్స్ను పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.ఇప్పటి వరకు మొత్తం 2,39,09,363 శాంపిల్స్ను పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది.రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో 301, పశ్చిమ గోదావరిలో 235, ప్రకాశం జిల్లాలో 232, తూర్పు గోదావరిలో 222, నెల్లూరులో 203 కేసులు నమోదయ్యాయి. రోజువారి కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా తీవ్రత తగ్గలేదని, జాగ్రత్తగాఉండాలని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన