ట్రావెల్ బ్యాన్ దేశాల నుంచి దుబాయ్ ఎక్స్ పో 2020కి ఎంట్రీ
- July 23, 2021
దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్పుకుంటున్న దుబాయ్ ఎక్స్ పో 2020కి అంతా సిద్ధమవుతోంది. ఎక్స్ పోలో పాల్గొనేందుకు వచ్చే వారిని ఎలాంటి అవాంతరాలు లేకుండా యూఏఈ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ట్రావెల్ బ్యాన్ లిస్టులో ఉన్న 16 దేశాలకు కొన్ని సడలింపులు ప్రకటించింది. ఎక్స్ పోలో పాల్గొనేందుకు వచ్చేవారిని కూడా ముందస్తు అనుమతులతో ఆమోదించనున్నట్లు యూఏఈ జిసిఏఏ స్పష్టం చేసింది. ప్రస్తుతం యూఏఈ ట్రావెల్ బ్యాన్ లిస్టులో ఇండియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లైబీరియా, నమీబియా, నేపాల్, నైజీరియా, ఉగాండా, సియెర్రా లియోన్, శ్రీలంక, వియత్నాం, జాంబియా దేశాలు ఉన్నాయి. అయితే..ఈ 16 దేశాల నుంచి కూడా ఎక్స్ పో 2020లో పాల్గొనేందుకు
అనుమతించిన వర్గాల వివరాలు ఇలా ఉన్నాయి.
-యూఏఈ పౌరులు, వారి కుటుంబ సభ్యులు మరియు వారి మొదటి-డిగ్రీ బంధువులు.
- ట్రావెల్ బ్యాన్ దేశాల నుంచి యూఏఈకి నియమించిన దౌత్యవేత్తలు, అడ్మినిస్ట్రేటీవ్ సిబ్బంది.
- ముందస్తు అనుమతి పొందిన అధికారిక ప్రతినిధులు.
- గోల్డ్, సిల్వర్ రెసిడెన్సీ వీసా పొందిన యూఏఈ ప్రవాసీయులు.
- దుబాయ్ ఎక్స్ ఎక్స్పో 2020 నిర్వాహకులు వ్యక్తిగతంగా స్పాన్సర్ చేసిన ఎక్స్పో ఎగ్జిబిటర్లు, ఇంటర్నేషనల్ పార్టిసిపేంట్స్.
- విదేశీ ఉత్పత్తులను తీసుకొచ్చే కార్గో విమానాల సిబ్బంది.
- పోర్ట్స్, బోర్డర్స్, ఫ్రీ జోన్ల సెక్యూరిటీ జనరల్ అథారిటీ అనుమతి పొందిన బిజినెస్ మెన్, బిజినెస్ వుమెన్.
- ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజన్ షిప్ వర్గీకరణ ప్రకారం కీలకమైన విధులకు చెందిన ఉద్యోగులు.
పైన తెలిపిన కేటగిరిల వారు ట్రావెల్ బ్యాన్ జాబితాలో ఉన్న 16 దేశాల నుంచి కూడా యూఏఈ వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ మెగా ఈవెంట్ టికెట్లు ఎక్స్పో వెబ్సైట్ తో పాటు 2,500 అధికారిక రీసెల్లర్ల దగ్గర్నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. ఇదిలాఉంటే ఈ వరల్డ్ బిగ్గెస్ట్ ఎక్స్ పో అక్టోబర్ 1, 2021న ప్రారంభమై మార్చి 31, 2022తో ముగుస్తుంది.ఎక్స్పో 2020 వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం, ఈవెంట్లో పాల్గొనే 191 దేశాల ప్రతినిధులకు ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేస్తున్నారు.ఎక్స్పోలో రోజుకు 60 వరకు లైవ్ ఈవెంట్లు ఉంటాయి - సినిమా రాత్రులు, కవిత్వ పఠనాలు, ఆర్ట్ యాక్టివేషన్స్, సంగీత కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి.అలాగే 200లకుపైగా ఫుడ్ వెరైటీలు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







