హజ్ మీల్స్ లో ఉల్లంఘనలపై ఫైన్
- July 23, 2021
సౌదీ: హజ్ యాత్రికులకు వడ్డించే భోజనంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై సౌదీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.మీల్స్ ప్రిపరేషన్ లోగానీ, వడ్డించే విషయంలోగానీ ముందస్తుగా చేసుకున్న ఒప్పందాల మేరకు క్యాటరింగ్ ప్రవైడర్లు నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొన్ని హజ్ సేవా సంస్థలు తక్కువ-నాణ్యత గల క్యాటరింగ్ ప్రొవైడర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాయని, కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్లను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.భోజనం వడ్డించే సమయంలో మాస్కులు కూడా ధరించటం లేదని సీరియస్ అయ్యింది.భోజనం విషయంలో నిబంధనల ఉల్లంఘనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత ఉల్లంఘునులపై జరిమానాలు విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







