ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం, 18మంది మృతి
- July 28, 2021
ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును భారీ ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 18మంది మృతి చెందగా.. 19మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా బీహార్వాసులుగా గుర్తించారు అధికారులు. బీహార్కు చెందిన వలసకూలీలు హర్యానా నుంచి స్వస్థలాలకు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ట్రక్కు ఢీ కొనడంతో బస్సు ముందు భాగమంతా నుజ్జునుజ్జు అయ్యింది. వలస కూలీలంతా బస్సు ముందు భాగంలోనే ఉండటంతో.. వారంతా చనిపోయారు. మరికొందరు బస్సులోనుంచి రోడ్డుపై పడ్డారు. దీంతో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదానికి గురైన డబుల్ డక్కర్ బస్సులో సుమారు వందకుపైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా హర్యానాకు చెందిన పాల్వాల్, హిసర్ జిల్లాల నుంచి బిహార్ వస్తున్నట్టుగా తెలిపారు బారాబంకీ ఎస్పీ యమునా ప్రసాద్.
ప్రమాదంలో గాయపడిన వారందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు అధికారులు. ప్రయాణికులంతా బీహార్కు చెందిన వివిధ ప్రాంతాల వారు కాగా.. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లుగా తెలిపారు ఎస్పీ యమునా ప్రసాద్. క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నుంచి తీసివేశామని.. బస్సు కింద ఎవరూ లేరని వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత
- యూఏఈ పై మళ్లీ ఇరాన్ క్షిపణి దాడుల ముప్పు.. గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తం
- ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
- రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ సమీపంలో అమెరికా సైనిక విమానం అదృశ్యం..
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్









