ఇరాన్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
- July 28, 2021భారత్లో వెలుగుచూసి.. సెకండ్ వేవ్ ఉధృతికి దారితీసిన డెల్టా వేరియంట్ ఇప్పుడు పలు దేశాలపై విజృంభిస్తోంది. ఈ జాబితాలో ఇరాన్ కూడా ఉంది. అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదౌతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 34,900 కేసులు, 357 మరణాలు నమోదయ్యాయి. సోమవారం కూడా 31,814 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వం గత వారమే ఆంక్షలు విధించింది. కార్యాలయాలు మూసివేయాలని ఆదేశించింది. నిత్యాసవసరాల దుకాణాలు మాత్రమే తెరచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. అయితే ఆంక్షల విషయంలో కఠినంగా వ్యవహరించకుండా ప్రజల అబిష్టానికే వదిలిపెట్టడంతో జనాలు సమూహాంగా తిరుగాడుతుండటంతో కేసులు పెరుగుతున్నాయి. టెహ్రాన్లో షాపింగ్ మాల్స్, మార్కెట్లు, మెట్రో స్టేషన్లలో జన సంచారం తీవ్రంగా ఉంది. ఆసుపత్రిలు ఖాళీ ఉండటం లేదు. ఎక్కువ మంది శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వస్తుండటంతో వైద్య నిపుణుల్లో ఆందోళన నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజుల్లోనే పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్
- బహ్రెయిన్ లో డ్రైవర్కు 7 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!
- జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్ ఈనెల 16 వరకు పాక్షికంగా మూసివేత..!!
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం









