బంగాళాఖాతంలో అల్పపీడనం
- July 28, 2021
తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులకు ఇంకా వరద కొనసాగుతుంది. మరోవైపు తాజాగా ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇవి రానున్న 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, దాన్ని అనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో పశ్చిమ దిశలోని పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
అల్పపీడన ప్రభావం కోస్తాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల కదలికలో మందగమనం కొనసాగనున్నందున ఎండ తీవ్రత పెరగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, గురువారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ సంక్షోభం: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత









