ప్రయాణికులకు దుబాయ్ ఎక్స్ పో 2020 డే పాస్..ఎమిరేట్స్ ఆఫర్
- July 31, 2021
దుబాయ్: తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వరల్డ్ గ్రేటెస్ట్ షోలో పాల్గొనే ఆఫర్ ప్రకటించింది ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్. ప్రతి ప్రయాణికుడికి ఒక్కో డే పాస్ ను కాంప్లిమెంటరీగా అందించనున్నట్లు వెల్లడించింది. ఆక్టోబర్ 1, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది. అంతేకాదు..దుబాయ్ మీదుగా ప్రయాణించే వారికి కూడా దుబాయ్ ఎక్స్ పో పాస్ లు పొందే అవకాశం కల్పించింది. కనెక్షన్ ఫ్లైట్ కోసం దుబాయ్ లో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం వేచి ఉండే ప్రయాణికులు అందరికి కాంప్లిమెంటరీ పాస్ లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదిలాఉంటే వరల్డ్ బిగ్గెస్ట్ ఎక్స్ పో కోసం దుబాయ్ సిద్ధం అవుతోంది. మరో మూడు నెలల్లో షో షురూ కానుంది.
తాజా వార్తలు
- రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- ఒమాన్లో 2028 నుండి 5% వ్యక్తిగత ఆదాయ పన్ను
- ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: స్థిరంగా యూఏఈ ఎయిర్ ట్రాఫిక్..సౌదీలో రెట్టింపు..!!
- సంక్షోభంలో మానవత్వం..ఇరాన్పై అమెరికా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు..!!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 3 అణు కేంద్రాలపై దాడులు..!!
- విలాయత్ బర్కాలో అగ్నిప్రమాదం..సీడీఏఏ
- ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్లు హ్యాక్.. ఐటీ భద్రతను పెంచాలన్న కంపెనీలు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా