ప్రయాణికులకు దుబాయ్ ఎక్స్ పో 2020 డే పాస్..ఎమిరేట్స్ ఆఫర్
- July 31, 2021
దుబాయ్: తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వరల్డ్ గ్రేటెస్ట్ షోలో పాల్గొనే ఆఫర్ ప్రకటించింది ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్. ప్రతి ప్రయాణికుడికి ఒక్కో డే పాస్ ను కాంప్లిమెంటరీగా అందించనున్నట్లు వెల్లడించింది. ఆక్టోబర్ 1, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది. అంతేకాదు..దుబాయ్ మీదుగా ప్రయాణించే వారికి కూడా దుబాయ్ ఎక్స్ పో పాస్ లు పొందే అవకాశం కల్పించింది. కనెక్షన్ ఫ్లైట్ కోసం దుబాయ్ లో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం వేచి ఉండే ప్రయాణికులు అందరికి కాంప్లిమెంటరీ పాస్ లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదిలాఉంటే వరల్డ్ బిగ్గెస్ట్ ఎక్స్ పో కోసం దుబాయ్ సిద్ధం అవుతోంది. మరో మూడు నెలల్లో షో షురూ కానుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







