బహ్రెయిన్: 40 ఏళ్లు మించిన వారికి బూస్టర్ షాట్..80% లక్ష్యం
- July 31, 2021బహ్రెయిన్: కోవిడ్ వేరియంట్ల నుంచి దేశ ప్రజలను రక్షించుకునేందుకు వీలైనంత ఎక్కువ మందికి బూస్టర్ షాట్ అందించే లక్ష్యంతో నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 40 ఏళ్లు అంతకుమించిన వయసు వారిలో కనీసం 80% మందికి బూస్టర్ షాట్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంటే దాదాపు 95,000 మందికి బూస్టర్ షాట్ ఇవ్వాల్సి ఉంటుంది. బూస్టర్ షాట్ పొందేందుకు అన్ని అర్హతలు ఉండి 40 ఏళ్లకు మించి వయసు వారు బహ్రెయిన్లో 2,50,000 మంది ఉన్నారు. ఇందులో 1,05,000 మంది ఇప్పటికే బూస్టర్ షాట్ తీసుకున్నారు. మిగిలిన వారిలో దాదాపు 95 వేల మందికి ఈ విడతలో బూస్టర్ డోస్ ఇవ్వాలన్నది నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ టార్గెట్. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంచుతూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రొత్సహిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?