బహ్రెయిన్: 40 ఏళ్లు మించిన వారికి బూస్టర్ షాట్..80% లక్ష్యం
- July 31, 2021
బహ్రెయిన్: కోవిడ్ వేరియంట్ల నుంచి దేశ ప్రజలను రక్షించుకునేందుకు వీలైనంత ఎక్కువ మందికి బూస్టర్ షాట్ అందించే లక్ష్యంతో నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 40 ఏళ్లు అంతకుమించిన వయసు వారిలో కనీసం 80% మందికి బూస్టర్ షాట్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంటే దాదాపు 95,000 మందికి బూస్టర్ షాట్ ఇవ్వాల్సి ఉంటుంది. బూస్టర్ షాట్ పొందేందుకు అన్ని అర్హతలు ఉండి 40 ఏళ్లకు మించి వయసు వారు బహ్రెయిన్లో 2,50,000 మంది ఉన్నారు. ఇందులో 1,05,000 మంది ఇప్పటికే బూస్టర్ షాట్ తీసుకున్నారు. మిగిలిన వారిలో దాదాపు 95 వేల మందికి ఈ విడతలో బూస్టర్ డోస్ ఇవ్వాలన్నది నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ టార్గెట్. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంచుతూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రొత్సహిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







