ప్రయాణికులకు దుబాయ్ ఎక్స్ పో 2020 డే పాస్..ఎమిరేట్స్ ఆఫర్
- July 31, 2021దుబాయ్: తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వరల్డ్ గ్రేటెస్ట్ షోలో పాల్గొనే ఆఫర్ ప్రకటించింది ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్. ప్రతి ప్రయాణికుడికి ఒక్కో డే పాస్ ను కాంప్లిమెంటరీగా అందించనున్నట్లు వెల్లడించింది. ఆక్టోబర్ 1, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది. అంతేకాదు..దుబాయ్ మీదుగా ప్రయాణించే వారికి కూడా దుబాయ్ ఎక్స్ పో పాస్ లు పొందే అవకాశం కల్పించింది. కనెక్షన్ ఫ్లైట్ కోసం దుబాయ్ లో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం వేచి ఉండే ప్రయాణికులు అందరికి కాంప్లిమెంటరీ పాస్ లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదిలాఉంటే వరల్డ్ బిగ్గెస్ట్ ఎక్స్ పో కోసం దుబాయ్ సిద్ధం అవుతోంది. మరో మూడు నెలల్లో షో షురూ కానుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?