తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- August 03, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం…గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 1,08,921 శాంపిల్స్ పరీక్షించగా… 609 మందికి పాజిటివ్గా తేలింది.మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతి చెందారు.ఇదే సమయంలో 647 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,46,606కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,34,018కి పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 3,811 మంది మృత్యువాతపడ్డారు.. ప్రస్తుతం 8,777 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.
తెలంగాణలో కరోనా రికవరీ కేసుల సంఖ్య 98.05 శాతంగా ఉంటే.. భారత్లో 97.36 శాతంగా ఉందని కోవిడ్ బులెటిన్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.. ఇక, తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 81 కేసులు నమోదు కాగా.. కరీంనగర్లో 67, ఖమ్మంలో 51, నల్గొండలో 48, వరంగల్ అర్బన్లో 41, పెద్దపల్లిలో 39, రంగారెడ్డిలో 36, మేడ్చల్లో 36 కేసులు.. ఇలా అత్యధికంగా కొత్త కేసులు వెలుగుచూశాయి.అయితే, హైదరాబాద్లో కంటే.. కరీంనగర్లోనే నిన్న అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







