టోక్యో ఒలింపిక్స్‌:భారత్‌కు మరో రజత పతకం

- August 05, 2021 , by Maagulf
టోక్యో ఒలింపిక్స్‌:భారత్‌కు మరో రజత పతకం

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది.కుస్తీ వీరుడు రవికుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.పురుషుల 57 కిలోల విభాగంలో ఫైనల్‌లో రష్యా రెజ్లర్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు రవికుమార్‌.. దీంతో.. ఆయన పసిడి పతకంపై పెట్టుకున్న ఆశలు ఆవిరికాగా… రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.రష్యా రెజ్లర్‌తో పోరాడి 4-7తో ఓడిపోయాడు రవికుమార్ దహియా.. ఫైనల్‌ ఓడినా ఆయనకు రజతం దక్కగా.. ఒలింపిక్స్‌ చరిత్రలోనే సిల్వర్‌ గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు రవికుమార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com