ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ క‌న్నుమూత‌

- August 21, 2021 , by Maagulf
ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ క‌న్నుమూత‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. లక్నోలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన రెండుసార్లు యూపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014-2019 వరకు రాజస్థాన్‌ గవర్నర్‌గా సేవలందించారు. కల్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. బాబ్రీ విధ్వంసం తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగించారు. తిరిగి 1998 ఫిబ్రవరి నుంచి 1999 నవంబర్ వరకు రెండో సారి ముఖ్యమంత్రిగా కల్యాణ్ సింగ్ పనిచేశారు. కాగా కల్యాణ్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంతాపం ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com