కువైట్ టూ ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్..కార్యచరణపై తుది కసరత్తు
- August 23, 2021
కువైట్: కువైట్ టూ ఇండియాకు ఇక డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. భారత్ తో పాటు ఆరు దేశాలకు నేరుగా విమానాలను నడిపేందుకు తగిన కార్యచరణను సిద్ధం చేస్తోంది కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA). అయితే..వారానికి ఎన్ని ఫ్లైట్స్ నడపాలి, ఏయే సిటీలకు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలి, రోజుకు ఎంత మంది ప్యాసింజర్లను అనుమతించాలనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై డీజీసీఏ తదుపరి సమావేశంలో చర్చించి తుది కసరత్తు పూర్తి చేయనుంది. ఇదిలాఉంటే..భారత్ తో పాటు ఈజిప్ట్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను ఎత్తివేస్తూ కువైట్ మంత్రిమండలి గత వారమే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









