కువైట్ టూ ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్..కార్యచరణపై తుది కసరత్తు

- August 23, 2021 , by Maagulf
కువైట్ టూ ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్..కార్యచరణపై తుది కసరత్తు

కువైట్: కువైట్ టూ ఇండియాకు ఇక డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. భారత్ తో పాటు ఆరు దేశాలకు నేరుగా విమానాలను నడిపేందుకు తగిన కార్యచరణను సిద్ధం చేస్తోంది కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA). అయితే..వారానికి ఎన్ని ఫ్లైట్స్ నడపాలి, ఏయే సిటీలకు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలి, రోజుకు ఎంత మంది ప్యాసింజర్లను అనుమతించాలనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై డీజీసీఏ తదుపరి సమావేశంలో చర్చించి తుది కసరత్తు పూర్తి చేయనుంది. ఇదిలాఉంటే..భారత్ తో పాటు ఈజిప్ట్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను ఎత్తివేస్తూ కువైట్ మంత్రిమండలి గత వారమే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com