అమెరికాకు తాలిబన్ల హెచ్చరిక
- August 23, 2021
కాబూల్: ఆప్ఘనిస్థాన్ నుంచి సైన్యం ఉపసంహరణకు నిర్దేశించిన గడువు పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు తాలిబన్లు హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ గతంలో చెప్పిన ఆగస్ట్ 31 నాటికి ఆ దేశ బలగాల ఉపసంహరణ పూర్తి కావాలని డిమాండ్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న సైన్యాన్ని పూర్తిగా వెనక్కి రప్పించేందుకు ఆగస్ట్ 31 కంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న బైడెన్ వ్యాఖ్యల నేపథ్యంలో తాలిబన్లు తాజాగా ఈ హెచ్చరిక చేశారు.
ఒప్పందం ప్రకారం తన బలగాలను అమెరికా పూర్తిగా వెనక్కి రప్పించిన తర్వాతే తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తి కానంత వరకు తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్ నుంచి సైన్యం ఉపసంహరణకు నిర్దేశించిన ఆగస్ట్ 31 గడువును మరింత పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు తాలిబన్లు హెచ్చరించారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత









