అరైవల్ లిమిట్ పెంచిన తర్వాతే ఇండియా నుంచి విమానం

- August 27, 2021 , by Maagulf
అరైవల్ లిమిట్ పెంచిన తర్వాతే ఇండియా నుంచి విమానం

కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆపరేటింగ్ సామర్థ్యాన్ని పెంచే విషయమై కౌన్సిల్ ఆఫ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఆ నిర్ణయానికి లోబడి, భారతదేశం నుంచి విమానాల విషయమై కీలక నిర్ణయం తీసుకుంటారు. భారత్ సహా మొత్తం 6 దేశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ప్రస్తుతం రోజుకి 7500 మంది ప్రయాణీకులకు మాత్రమే అనుమతిచ్చేలా వెసులుబాటు వుంది. దాన్ని పెంచాల్సిందిగా డిజిసిఎ ఓ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది కౌన్సిల్ ఆఫ్ మినస్టర్స్‌కి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com