భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- August 28, 2021 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా టెర్రర్‌ కొనసాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో కొత్తగా 46,759 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,26,49,947 కి చేర‌గా ఇందులో 3,18,52,802 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,59,775 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనాతో 509 మంది మృతి చెందారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,37,370 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 24 గంట‌ల్లో 1,03,35,290 మందికి టీకాలు వేశారు. దీంతో భారత్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 62,29,89,134 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com