చరిత్ర సృష్టించిన భవీనాబెన్ పటేల్
- August 29, 2021
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించారు.టేబుల్ టెన్నిస్లో ఫైనల్కు దూసుకెళ్లి ఇప్పటికే పతకాన్ని ఖాయం చేసుకున్న ఆమె.. ఇవాళ గోల్డ్ మెడల్ కోసం జరిగిన పోరులో పరాజయాన్ని చవిచూసింది.. ప్రపంచ నంబర్ వన్, చైనా క్రీడాకారిణి యింగ్ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలయ్యారు.. దీంతో ఆమె రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. కాగా, మొన్న బ్రెజిల్కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్లో 3-0తో అద్భుత విజయం సాధించి క్వార్టర్స్లో అడుగుపెట్టిన భవీనాబెన్..ఆ తర్వాత ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్తో జరిగిన పోరులోనూ ఘన విజయం సాధించి సెమీస్కు చేరుకుంది.ఇక, చైనాకు చెందిన మియావో జాంగ్తో జరిగిన సెమీఫైనల్లో 3-2తో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఇక, ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఓడినా పారాలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించిన చరిత్ర సృష్టించింది. ఇక, పారాలింపిక్స్లో కొత్త రికార్డు సృష్టించిన భవీనా పటేల్కు అభినందనలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







