కాబూల్ విమానాశ్రయం వద్ద మరో ఉగ్రదాడి జరగబోతుందట
- August 29, 2021
కాబూల్: అఫ్గానిస్థాన్లోని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మూడు రోజుల భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.ఈ దాడి లో దాదాపు 180 మంది వరకు మరణించగా..వందల సంఖ్య లో గాయపడ్డారు. ఇప్పుడు మరో హెచ్చరిక జారీచేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.రాగల 24 నుంచి 36 గంటల్లో విమానాశ్రయ పరిసరాల్లో ఉగ్రవాదులు మరోసారి దాడులు జరగడానికి అత్యంత అవకాశాలు ఉన్నాయని..విమానాశ్రయంను పౌరులు తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు.ఈ విషయాన్ని తమ సైనికాధికారులు తనకు చెప్పారని వెల్లడించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ కాబూల్ నుంచి పౌరుల తరలింపు కొనసాగుతున్నదని బైడెన్ వెల్లడించారు.శనివారం మరో 6800 మందిని అక్కడి నుంచి తరలించామని, అందులో వేలసంఖ్యలో అమెరికన్లు కూడా ఉన్నారని చెప్పారు.
ఇదిలా ఉంటె కాబూల్ లో పరిస్థితి దారుణంగా ఉంది.కనీసం తాగడానికి నీరు కూడా దొరకని దారుణమైన పరిస్థితి నెలకొంది. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కుల చూపిస్తున్నాయి.ఒక వాటర్ బాటిల్ ధర 40 డాలర్లుగా(దాదాపు రూ. 3వేలు) ఉండటం సామాన్యులకు ఇబ్బందికరంగా మారింది. అయితే అమ్మకాలు.. డాలర్లలో సాగడంతో వాటర్ బాటిల్ కొని దాహం తీర్చుకోలేని స్థితిలో కాబూల్ ఎయిర్పోర్ట్లో చాలా మంది జనాలు కష్టాలు అనుభవిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







