దుబాయ్ నుంచి అబుదాబీకి 15 నిమిషాల్లోనే
- March 14, 2016
రవాణా రంగంలో హైపర్లూప్ సరికొత్త సంచలనాలకు సిద్ధమవుతోందని యూఏఈ ఫెడరల్ రటాన్స్పోర్ట్ అథారిటీ - ల్యాండ్ అండ్ మెరిటైమ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా ఎస్ అల్ కతీరి చెప్పారు. హైపర్ లూప్ ద్వారా గంటకు 1,100 కిలోమీటర్ల వేగంతో కార్గో మరియు ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చవచ్చునని హైపర్ లూప్ టెక్నాలజీస్ ప్రతినిథులు వెల్లడించారు. హై స్పీడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్తో పోల్చితే ఖర్చు కూడా 62 శాతం తక్కువే అవుతుందని వారు చెప్పారు. యూఏఈ, దుబాయ్ తొలిసారిగా హైపర్లూప్ టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా చరిత్రకెక్కే అవకాశం ఉందని వారు వివరించారు. హైపర్ లూప్ టెక్నాలజీస్ తమ ప్రాజెక్ట్ని వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. లాస్ వెగాస్లో ఈ ఏడాది దీన్ని పరీక్షించనున్నారు. యూఏఈలో 10 నుంచి 15 ఏళ్ళలోపే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుందని హైపర్లూప్ వెల్లడించింది. హైపర్ లూప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే దుబాయ్ నుంచి అబుదాబీకి చేరుకోవడం వీలవుతుంది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









