శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

- September 03, 2021 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్‌ విమానాశ్రయంలో మరో సారి భారీగా బంగారం పట్టుబడింది.కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున షార్జా నుంచి G9458 ఎయిర్ అరేబియా విమానంలో శంషాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడు మహ్మద్‌ రఫీక్‌ బ్యాగులను కస్టమ్స్‌ అధికారులు తఖీలు చేయగా కేజీ బంగారం పేస్ట్ రూపంలో లో దుస్తుల్లో దాచి పెట్టాడు.దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు.లో దుస్తుల్లో దాచి పెట్టాడు బంగారం విలువ దాదాపు రూ.43.55 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com