ఛారిటీ వర్క్ కోసం ఎహ్సాన్ కు SR10M విరాళం ఇచ్చిన యువరాజు
- September 12, 2021రియాద్: సౌదీ యువరాజు, రక్షణ మంత్రి ముహమ్మద్ బిన్ సల్మాన్ తన ధాత్రృత్వాన్ని చాటుకున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కోసం "ఎహ్సాన్" జాతీయ వేదికకు ధార్మిక, లాభాపేక్షలేని పనుల నిర్వహణకు SR 10 మిలియన్లను విరాళంగా ఇచ్చారు. "ఎహ్సాన్" జాతీయ వేదిక ఇటీవల సౌదీ డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) ద్వారా విరాళాల నిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పోర్టల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. క్రౌన్ ప్రిన్స్ విరాళంతో, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం ఎహ్సాన్ ప్లాట్ఫామ్ ద్వారా సేకరించిన విరాళం SR1 బిలియన్లకు చేరుకుందని, SDAIA ప్రెసిడెంట్ అబ్దుల్లా బిన్ షరాఫ్ అల్-గమ్ది తెలిపారు. ఎహ్సాన్ జాతీయ వేదిక ధార్మిక కార్యక్రమాల కోసం క్రౌన్ ప్రిన్స్ అందించిన ఉదార విరాళాన్ని ఎంతో విలువైనదిగా ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు