ఆప్ఘాన్కు అండగా మేముంటాం: జైశంకర్
- September 14, 2021
ఢిల్లీ: ఆప్ఘానిస్తాన్కు అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఆప్ఘాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, మానవ సంక్షోభం ఏర్పడిందని, దీంతో ఆ దేశానికి మరింత ముప్పు పొంచి ఉందని కేంద్రమంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఆప్ఘానిస్తాన్లో నెలకొన్న మానవ సంక్షోభం యూనైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సమావేశంలో నిర్వహించింది. ఈ సమవేశంలో భారత్ తన పాత్ర గురించి వివరించింది.
ఆప్ఘాన్ను అమెరికా బలగాలు వీడిన తర్వాత తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో ఆ దేశంలో ఎన్నో సమస్యలు ఏర్పడ్డాయి. మహిళలపై తాలిబన్లు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఆహార, ఆర్థిక, రాజకీయ, సామాజిక భద్రత వ్యవహారాలతో ఆప్ఘాన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే ఆప్ఘాన్లోని ప్రస్తుత పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అక్కడ పేదరికం మరింత పెరిగే అవకాశముందని యూఎన్ఓ అంచనాలను మరోసారి గుర్తు చేశారు. అయితే ఎప్పటిలానే ఆప్ఘాన్తో భారత్ స్నేహాపూర్వక సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆప్ఘాన్ ప్రజల తరపున నిలబడేందుకు భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!









