ఆప్ఘాన్కు అండగా మేముంటాం: జైశంకర్
- September 14, 2021
ఢిల్లీ: ఆప్ఘానిస్తాన్కు అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఆప్ఘాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, మానవ సంక్షోభం ఏర్పడిందని, దీంతో ఆ దేశానికి మరింత ముప్పు పొంచి ఉందని కేంద్రమంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఆప్ఘానిస్తాన్లో నెలకొన్న మానవ సంక్షోభం యూనైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సమావేశంలో నిర్వహించింది. ఈ సమవేశంలో భారత్ తన పాత్ర గురించి వివరించింది.
ఆప్ఘాన్ను అమెరికా బలగాలు వీడిన తర్వాత తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో ఆ దేశంలో ఎన్నో సమస్యలు ఏర్పడ్డాయి. మహిళలపై తాలిబన్లు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఆహార, ఆర్థిక, రాజకీయ, సామాజిక భద్రత వ్యవహారాలతో ఆప్ఘాన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే ఆప్ఘాన్లోని ప్రస్తుత పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అక్కడ పేదరికం మరింత పెరిగే అవకాశముందని యూఎన్ఓ అంచనాలను మరోసారి గుర్తు చేశారు. అయితే ఎప్పటిలానే ఆప్ఘాన్తో భారత్ స్నేహాపూర్వక సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆప్ఘాన్ ప్రజల తరపున నిలబడేందుకు భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- ఏఐ (AI)ని ఉపయోగించిన క్రిమినల్ హ్యాకర్లు.. గూగుల్ అలెర్ట్..!!
- ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!
- కువైట్ తొలి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం..!!
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!









