అది అయిదో టెస్టుగానే ఉండాలి: గంగూలీ
- September 14, 2021
దిల్లీ: కరోనా భయాల వల్ల భారత్, ఇంగ్లాండ్ మధ్య అర్ధంతరంగా ఆగిపోయిన అయిదో టెస్టును తిరిగి ఎప్పుడు నిర్వహించినా.. అది ఈ సిరీస్లో భాగంగానే ఉండాలన్నది తమ అభిమతమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా చివరిదైన ఈ మ్యాచ్ ఈ నెల 10న మాంచెస్టర్లో ఆరంభం కావాల్సింది. అయితే భారత సహాయ బృందంలో నలుగురు కరోనా బారిన పడటంతో మైదానంలోకి దిగేందుకు కోహ్లీసేన నిరాకరించింది. దీంతో మ్యాచ్ రద్దు చేశారు. ఈ మ్యాచ్ను రీషెడ్యూల్ చేయాలని చూస్తున్న నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ..
''ప్రస్తుత సిరీస్ పూర్తిగా జరగాలి. ఇందులో విజయం సాధిస్తే.. 2007 తర్వాత తొలి సిరీస్ గెలుపవుతుంది. ప్రస్తుతం ఆగిపోయిన టెస్టు మ్యాచ్ ఎప్పుడు జరిగినా.. అది ఈ సిరీస్లో అయిదో టెస్టుగానే ఉండాలన్నది మా అభిమతం'' అని గంగూలీ అన్నాడు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







