ఎక్స్‌పో 2020 దుబాయ్: మొబైల్ నెట్‌వర్క్స్ పేర్ల మార్పు

- September 14, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్: మొబైల్ నెట్‌వర్క్స్ పేర్ల మార్పు

దుబాయ్: ప్రత్యేక సందర్భాల్లో యూఏఈ మొబైల్ నెట్‌వర్క్స్ తమ పేర్లను కాస్త మార్చుకోవడం జరుగుతుంటుంది. చారిత్రాత్మక సందర్భం హోప్ ప్రోబ్ కోసం ఫిబ్రవరిలో, యూఏఈ ప్రెసిడెంట్ కప్ 2021 కోసం మే నెలలో ఈ మార్పులు జరిగాయి. తాజాగా, ఎక్స్‌పో దుబాయ్ 2021 కోసం ఎటిసలాట్ మరియు డు మొబైల్ నెట్‌వర్క్స్ తమ పేర్లను మార్చడంతో, ఆయా మొబైళ్ళలో సరికొత్త పేర్లు దర్శనమిచ్చాయి. ఎక్స్‌పో 2020 దుబాయ్ అక్టోబర్ 1న ప్రారంభమై ఆరు నెలలపాటు కొనసాగుతుంది. మార్చి 31తో ఈ ఈవెంట్ ముగుస్తుంది. 190 దేశాల నుంచి ఈ ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ఇప్పటికే సన్నాహాలు జరిగిపోయాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com