ప్రయాణికుల పరిమితి సంఖ్యను పెంచాలని కోరిన DGCA
- September 18, 2021
కువైట్: దేశంలోకి అనుమతించే ప్రయాణికుల పరిమిత సంఖ్యను మరింతగా పెంచాలని కైవైట్ మంత్రిమండలిని ఆ దేశ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కోరారు. ప్రస్తుతం 10,000 మందికి మాత్రమే అనుమతి ఉంది. అయితే..ఇతర దేశాల నుంచి కువైట్ వచ్చేందుకు ఇంకా చాలామంది ఎదురుచూస్తున్నారని..దీంతో లిమిటెడ్ ఫ్లైట్ సర్వీసులపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. టికెట్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయన్నారు. ముఖ్యంగా ఈజిప్ట్, ఇండియా నుంచి వచ్చే వారు ఎక్కువ ధరకు టికెట్లను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. అంతేకాదు..పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్న కారణంగా కువైట్ విమానయాన సంస్థలు కొత్త ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించలేకపోతున్నాయని కూడా వివరించింది. ఈ పరిస్థితులను అదిగమించేందుకు దేశంలోకి అనుమతిస్తున్న పరిమిత సంఖ్యను పెంచాలని డీజీసీఏ కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









