6వ ఎడిషన్ ‘బ్రేక్ ఫాస్ట్ విత్ ది కాన్సూల్ జనరల్’ దుబాయ్.!
- September 18, 2021
రాస్ అల్ ఖైమా: దుబాయ్లో భారత కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ‘బ్రేక్ ఫాస్ట్ విత్ ది కాన్సుల్ జనరల్’ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంబర్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్సి, రస్ అల్ ఖైమాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని వర్క్ ఫోర్స్ కోసం నిర్వహించారు. అంబర్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ధర్మ దేవ్ భట్, ఇండియన్ బిజినెస్ మరియు ప్రొఫెషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సబ్రతా ముఖర్జీ, ఆస్టర్ వలంటీర్స్ మెడికల్ టీమ్, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులతో ఇలా ఇంటరాక్ట్ అవడం ఆనందంగా వుందని కాన్సుల్ జనరల్ పేర్కొన్నారు.

ఇండియన్ బ్లూ కాలర్ వర్కర్ల భద్రత, హక్కుల కోసం కృషి చేస్తామని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో భారతీయులందరూ తమ మాతృదేశం పట్ల ప్రత్యేకమైన భక్తిభావంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కాగా, అస్టర్ నుంచి మెడికల్ టీమ్ అలాగే, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిథులు కార్మికులతో సమావేశమవడం, పలు అంశాలపై వారికి అవగాహన కల్పించడాన్ని అభినందించారు కాన్సుల్ జనరల్. మెడికల్ టీమ్, వర్కర్లకు హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించారు. కాన్సుల్ జనరల్ అక్కడే ఓ మొక్కను నాటారు.ర్యాఫిల్ డ్రా నిర్వహించి కాన్సుల్ జనరల్, బహుమతుల్ని విజేతలకు అందంచారు.






తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







